ప్రజాలహరి, హైదరాబాద్…. ఆగ్రోస్ ను ఆర్థికంగా బలోపేతం చేయాలి రీజనల్ మేనేజర్ల సమావేశంలో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి
రీజనల్ మేనేజర్లతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తిప్పన విజయసింహారెడ్డి ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆగ్రోస్ ఎండి కె. రాములు గారు ప్రాంతీయ అధికారులు వెంకన్న రామకృష్ణ, ప్రవీణ్లు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చైర్మన్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఆగ్రోస్ బలోపేతానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎరువులు విత్తనాల విషయంలో ప్రముఖ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామని ఆ మేరకు ఇటు ఈ ఆర్ ఏ ఎస్ కే వ్యాపారస్తులు అటు రైతులకు ఆర్థిక ప్రయోజనం కలిగే విధంగా మార్కెటింగ్ వ్యవస్థతో పని చేయించాలని అధికారులను ఆదేశించారు.రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.