Ultimate magazine theme for WordPress.

ఆగ్రోస్ రీజినల్ సమావేశం…

Post top
home side top

ప్రజాలహరి, హైదరాబాద్…. ఆగ్రోస్ ను ఆర్థికంగా బలోపేతం చేయాలి రీజనల్ మేనేజర్ల సమావేశంలో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి

రీజనల్ మేనేజర్లతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తిప్పన విజయసింహారెడ్డి ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆగ్రోస్ ఎండి కె. రాములు గారు ప్రాంతీయ అధికారులు వెంకన్న రామకృష్ణ, ప్రవీణ్లు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చైర్మన్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఆగ్రోస్ బలోపేతానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎరువులు విత్తనాల విషయంలో ప్రముఖ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామని ఆ మేరకు ఇటు ఈ ఆర్ ఏ ఎస్ కే వ్యాపారస్తులు అటు రైతులకు ఆర్థిక ప్రయోజనం కలిగే విధంగా మార్కెటింగ్ వ్యవస్థతో పని చేయించాలని అధికారులను ఆదేశించారు.రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.