Ultimate magazine theme for WordPress.

రైల్వే స్టేషన్ కు రోడ్డు వేయాలి

Post top
home side top

రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేయాలి:-

మిర్యాలగూడ, ప్రజాలహరి….మిర్యాలగూడ పట్టణం నుండీ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు వేసిన సీసీ రోడ్డును స్టేషన్ వరకు పొడిగించాలని జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీయాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం రైల్వే స్టేషన్ రోడ్డుపై నిరసన తెలిపి మాట్లాడుతూ సీసీ స్టేషన్ వరకు వేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ కు కొద్దిదూరం వరకు సీసీ రోడ్డు వేసి వదిలివేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రతిరోజు రోడ్డుపై వేలాది మంది ప్రయాణిస్తున్న పూర్తి స్థాయిలో రోడ్డు లేకపోవడంతో ద్వంసమైన రోడ్డు గుండా ప్రయాణించాల్సివుందన్నరు. భవిష్యత్ లో ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అసంపూర్తిగా ఉన్న రోడ్డున స్టేషన్ వరకు వేయాలని కోరారు. రవీంద్రనగర్ కాలనీ నుండి వచ్చే రహదారి వెంట వీది దీపాలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కొండల్ గౌడ్, జహంగీర్, వెంకటయ్య, బుచ్చయ్య, రామకృష్ణ,లక్ష్మి నారాయణ, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.