Ultimate magazine theme for WordPress.

మతతత్వ ,నిరంకుశ పాలన ను ఓడించాలి

Post top
home side top

నిరంకుశ పాలనకు ఓడించి బుద్ధి చెప్పాలి.

* బిజెపియేతర పార్టీలన్నీ ఏకం కావాలి

* రాజకీయ శిక్షణ తరగతులు జూలకంటి

ప్రజాలహరి-మిర్యాలగూడ

 

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు బుధవారం స్థానిక జె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో నియోజవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు నిరంకుశ పాలన చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే విధానం, ఒకే పార్టీ ఒకే ప్రభుత్వం ఉండాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడని అందులో భాగంగానే దేశంలో మనుషుల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు రేపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని అర్పించారు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కార్పొరేట్ సంస్థలను, ఆర్ఎస్ఎస్ విధానాలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజ్యాన్ని ఏలుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారతత్వం చేశారని ఆరోపించారు. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నాడని విమర్శించారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మకానికి పెడతాడని విమర్శించారు మోడీని గద్దె దింపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపి మోడీ వ్యతిరేక విధానాలను ప్రజలకు గురించి చైతన్యపరచాలని కోరారు. మోడీ అవలంబిస్తున్న విధానాలు ప్రజలు అర్థం చేసుకున్నారని, ప్రజల పక్షాన పొట్టి పక్ష పార్టీలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బంది మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందరిని పర్మినెంట్ చేయాలన్నారు.పార్టీ- ప్రజాసంఘాల నిర్మాణం, మధ్యాహ్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలు…పర్యవసానాలుపై

టీచర్లుగా సోమయ్య, మిరియం వెంకటేశ్వర్లు బోధించారు. ప్రిన్సిపాల్ గా విరేపల్లి వెంకటేశ్వర్లు వ్యవహరించగా రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సీనియర్ నాయకులు జగదీష్ చంద్ర, జిల్లా కమిట్ సభ్యులు రవి నాయక్, డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, వినోద్ నాయక్, తిరుపతి రామ్మూర్తి, పరుశురాములు, రాగిరెడ్డి మంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.