*ఉత్తమ డిపో మేనేజర్ గా మిర్యాలగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ పాల్*
మిర్యాలగూడ ప్రజాలహరి. ప్రతినిత్యము ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను నడిపిస్తూ మన మిర్యాలగూడ డిపో స్థాయిని పెంచి ఉత్తమ డిపో మేనేజర్ గా పాల్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా టి ఎస్ ఆర్టీసీ ఎం.డి సజ్జన్నార్ చేతులమీదుగా ఉత్తమ అవార్డు తీసుకున్న సందర్బంగా పాల్ ను ఐ.ఎన్.టి.యు.సి నల్లగొండ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్, మిర్యాలగూడ డిపో మేనేజర్ ఛాంబర్ నందు డిఎంని ఘనంగా సన్మానించి ఇక ముందు కూడా మన డిపో స్థాయి ని పెంచుతూ ప్రయాణికులకు చేరువతో ముందుకెళ్లాలని కోరారు.