మిర్యాలగూడ ప్రజాలహరి….మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక చింతపల్లి బైపాస్ నందు పంచాయత్ రాజ్ శాఖ సి.డి.పి గ్రాంట్ ద్వారా 10 లక్షల రూపాయల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, శాసన మండలి సభ్యులు .మంకెన కోటిరెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి తెలంగాణ మొదటి శాసన సభాపతి మరియు శాసన మండలి సభ్యులు సరికొండ మధుసూదన చారి ఈరోజు శంకుస్థాపన చేశారు..అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మధుసూదనా చారికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు, వారి తనయులు, యువనేత నల్లమోతు సిద్ధార్థ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.. అనంతరం బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు అన్నాభిమొజు నాగార్జున చారి గారి ఆద్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాస్, బి.ఆర్.ఎస్ నాయకులు పత్తిపాటి నవాబ్, బల్లెం అయోధ్య, జిల్లా రైతు బంధు సమితి మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, బి.ఆర్.ఎస్వి రాష్ట్ర కార్యదర్శి యం.డి షోయబ్, విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు గడగొజు చంద్ర శేఖర్, చేర్యాల వెంకటచారి, ఈనుగుర్తి గోవర్ధనా చారి, మండలోజు సైదా చారి, అనుముల దుర్గా ప్రసాద్, పగిడిమర్రి నాగేంద్ర చారి, వివిద కుల సంఘాల పట్టణ అద్యక్షులు, ఉపాద్యక్షులు జిల్లా అద్యక్షులు, తదితరులు పాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.