ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని
సినీ స్వరాభిషేకం : మిర్యాలగూడ ప్రజాల హరి
మిర్యాలగూడ: నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 26వ తేదీ ఆదివారం మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడలోని ఎస్సార్ డీజీ పాఠశాలలో సాయంత్రం ఐదు గంటల నుండి 10 గంటల వరకు ఎన్టీఆర్ నటించిన చిత్రాల నుండి పాటలను గాయనీ గాయకులు ఆలపిస్తారని నిర్వాహకులు జకినాలపల్లి శ్రీనివాస చారి,కందుకూరి సుదర్శన్, ఏలే సత్యనారాయణ, ఎం సత్యనారాయణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని రచయితలు కవులు కళాకారులు మేధావులు, కళాభిమానులు, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని దిగ్విజయం చేయాలని కోరారు