Ultimate magazine theme for WordPress.

భారత రాష్ట్ర సమితి పని గోవింద.. రేవంత్ రెడ్డి

Post top
home side top

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కథ ఖేల్ కతం.. రేవంత్ రెడ్డి…

 

ప్రజాలహరి హైదరాబాద్… పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆరు నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి మెజార్టీ స్థానాలను గెలిపించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పోరాటం వలన ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ పోరాటం వలన ఈరోజు మోడీ ప్రభావం తగ్గిందని చెప్పారు. కెసిఆర్ అసమర్ధ నిర్ణయాలు వలన పార్టీ పార్లమెంటు సీట్లలో రెండో స్థానానికి కూడా చేరుకోలేకపోయిందని పేర్కొన్నారు. ఏడు నియోజకవర్గాల్లో మూడో స్థానాల్లో ఉందని కెసిఆర్ నాయకులు అగ్రనేతలు బిజెపిని గెలిపించడానికి ఎక్కువగా కృషి చేశారని వివరించారు. వారి ఆత్మ బలిదానం చేసుకున్నారని అవయాలను బిజెపి గెలుపుకు దానం చేశారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భాజపాను గెలిపించడానికి బాగా పనిచేశారని విమర్శించారు. ఇప్పటికైనా కెసిఆర్ పార్టీ నాయకులు వాస్తవానికి దగ్గర ఉండి ఆలోచించి పార్టీని నడిపించుకోవాలని ఆ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. అసందర్భ పోరాటాలు చేయొద్దని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని ఎనిమిది పార్లమెంటు8 సీట్లతో పాటు ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలుపొందామని దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 65 పెరిగిందని వివరించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలనీ కెసిఆర్ కు హితవు పలికారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.