Ultimate magazine theme for WordPress.

విద్యార్థులకు సృజనాత్మకతో కూడిన విద్యను బోధన చేయాలి.. డివిఎస్ ఫణి కుమార్

Post top
home side top

సృజనాత్మకతో కూడిన విద్యను బోధన చేయాలి … పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు డి వీఎస్ ఫణి కుమార్… ప్రజాలహరి మిర్యాలగూడ..

మారుతున్న విద్యా కాలగమనంలో విద్యార్థులకు సృజనాత్మతో కూడిన విద్యను బోధన చేయాలని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు డివిఎస్ ఫణి కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మిర్యాలగూడ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో డివిఎస్ ఫణికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుందని ఆ విషయాన్ని గ్రామస్థాయిలో ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళాలని ఆయన ఉపాధ్యాయ సంఘం నేతలకు ఉపాధ్యాయులకు సూచనలు చేశారు .ప్రభుత్వ పాఠశాలలో , బీఈడీ ,టెట్ డైట్, లాంటి ఉన్నత ప్రమాణాలు కూడిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారని ఆ విషయాన్ని గ్రామస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు ప్రజాస్వామ్యవాదుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచనలు చేశారు. నాటితరం ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అత్యున్నతస్థాయి శిఖరాలకు చేరుకున్న వారిని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మారుమూల పల్లెలు బస్సు సౌకర్యాలు లేని ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని బీటెక్, ఎంటెక్, ఎంఎస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ ఆఫీసర్స్, బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఇతర శాఖలలో నియమితులైన వారు కోకొల్లలు అని తెలిపారు. గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అత్యున్నత శిఖరాల చేరిన వారి లిస్టు గ్రామసభల్లో ,గ్రామ స్థాయిలో తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, అధికారులకు మండల స్థాయి, అధికారులకు ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మా మాజీ ఎమ్మెల్సీ పూల రవీంద్ర పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.