నల్గొండ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న మాజీ శాసనసభ్యులు ప్రస్తుత మిర్యాలగూడ జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి
మిర్యాలగూడ, ప్రజాలహరి
నల్లగొండ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జడ్పీ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని,వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి మాత్రమే అమలు చేసి మిగతా వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సీజన్ కు ముందు రైతు బంధు ఎకరానికి 5000 చొప్పున నేరుగా రైతు ఖాతాలో జమ చేసి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు.మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా ఎకరానికి 7500 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈరోజుకు రైతు భరోసా జమ చేయటం లేదని పైగా రైతు భరోసా విధివిధానాలు కమిటి పేరుతో రైతు భరోసా రాదేమో అని రైతులు బాధపడుతున్నారని ఆరోపించినారు. ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విధివిధానాల్లో ఐటీ రిటర్న్స్ చేసే రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.కానీ పేద రైతులు కూడా గృహ నిర్మాణం బ్యాంకు లోన్ కొరకు విద్యార్థుల పై చదువుల లోన్ల కొరకు ఐటీ రిటర్న్స్ చేస్తున్నారానే విషయాన్ని ముఖ్యమంత్రి గమనించి అందరికీ వర్తింపజేయాలని కోరినారు. విద్యుత్ పైచర్చ సందర్భంగా సూపరిండెంట్ ఇంజనీర్ మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్తు అందిస్తున్నామని సమావేశానికి తెలియజేసినారు.దీనిపై స్పందించిన విజయసింహారెడ్డి గారు మాట్లాడుతూ వాస్తవంగా 15 గంటల కరెంటు కూడా రావట్లేదని తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించవద్దని కోరినారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనందున వెంటనే రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేయాలని, రైతులకు 24 గంటల కరెంటు, సాగునీరు తాగునీరు ఇచ్చి ఆదుకోవాలని, రాబోయేది వానకాలం సీజన్ కాబట్టి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని వైద్య శాఖను కోరారు