తెలంగాణలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు..
ప్రజాలహరి జనరల్ డెస్క్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆయన ఈరోజు వరంగల్లో పర్యటించారు వరంగల్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి ని ప్రారంభించారు. ప్రారంభ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలకు తక్కువ డబ్బులలో మెరుగైన వైద్యం అందించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని చెడ్డ పేరు నుంచి నుంచి బయటకు రావాలని కోరారు. శంషాబాద్ ను ఐటి హబ్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో కూడా పలు సంచనాత్మక మార్పులు తీసుకొస్తానే ఈ సందర్భంగా చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎకో టూరిజం మెగా టెక్సల్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు వరంగల్ లో ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు నత్త నడకగా నడుస్తున్నాయని పేర్కొన్నారు ఎస్టిమేషన్ మరో 600 కోట్లు పెరిగిందని దీనిపై ఆడిట్ చేయిస్తానని అధికారులకు హెచ్చరించారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దూరదృష్టి వలనే హైదరాబాద్ తెలంగాణలో ఐటీలో రాణించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.