Ultimate magazine theme for WordPress.

వైద్యుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో డాక్టర్లచే ర్యాలీ

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి:జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ప్రాణాలు రక్షిస్తున్న ప్రతి డాక్టర్ కి మా ధన్యవాదాలు అంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ అపోలో రీచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్లను అపోలో రీచ్ యాజమాన్యం ఘనంగా డాక్టర్ నువ్వా రామారావు ను సన్మానించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గతంలో మహానగరాలకే పరిమితమైన కార్పొరేట్ వైద్య సేవలను మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలకు అందజేసేందుకు ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటు ధరలోనే అందిస్తున్నామని తెలిపారు.అధునాతన వైద్య పరికరాలతో సులభతరమైన చికిత్స విధానాలతో ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తామన్నారు.త్వరలోనే ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెస్తామన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.