మిర్యాలగూడ ప్రజాలహరి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి తన నివాసానికి ఆహ్వానించారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహా దారుడు వేo నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.