ప్రజాలహరి హైదరాబాద్ ..
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి కవిత్వ పుస్తకాలను కేసీఆర్కి అందజేశారు.
అదే సందర్భంలో.. సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకాన్ని కేసీఆర్కి అందించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు.