*నాయి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నాయి యువసేన ఫౌండేషన్* మిర్యాలగూడ ప్రజాలహరి…మిర్యాలగూడ పట్టణ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యుడు దోమలపల్లి ఎల్లయ్య గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎల్లయ్యకు ప్రస్తుతం కుల వృత్తి చేయలేని స్థితిలో ఉన్నందున విషయం తెలుసుకున్న నాయి యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వారి నివాసం అభంగాపురం కు వెళ్లి 50 కేజీల బియ్యం మరియు వారానికి సరిపడా కూరగాయలను,నిత్య అవసరకులను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.అనంతరం నాయి యువసేన ఫౌండేషన్ వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని, కలిసి ఉంటేనే కలదు సుఖం అని వారు అన్నారు.ఆపదలో ఉన్న వారిని తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో మా నాయి యువసేన ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరి,సత్య,ఉపేందర్, నగేష్,వెంకట్,నరేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.