చర్చల ద్వారా రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుందాం. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, మంత్రులు నిర్ణయం
ప్రజాల హరి హైదరాబాద్….ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రులు, పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు శ్ కందుల దుర్గేష్, సత్య కుమార్ ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమ ప్రారంభంలో రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాళోజీ నారాయణ రావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని బహుకరించారు.