ఉషారాణి హోటల్ యజమాని దాడి చేసిన వారిపై కేసు నమోదు
నిందితులను జుడీషియల్ రిమాండ్ తరలింపు(మిర్యాలగూడ క్రైమ్) ప్రజాలహరి…
మిర్యాలగూడకి చెందిన నలుగురు వ్యక్తులు మద్యం సేవించి మిర్యాలగూడ బైపాస్ లో ఐదో తేదీన తెల్లవారుజామున ఉషారాణి హోటల్ కి పరోటా తినడానికి వెళ్లి, అక్కడ వారు ఇప్పుడే హోటల్ ఓపెన్ చేశాము కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో వారితో గొడవపడి హోటల్ యజమాని అయిన వెంకటేశ్వర రావు @ వెంకన్న పై వారందరూ కలిసి వెంకటేశ్వర రావు ను కూరగాయలు కోసే కత్తితో హత్యాయత్నం చేయగా అతని తలపైన తగిలి రక్తగాయం అయినది. అతని ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో C.I నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి అట్టి నలుగురు నిందుతుల లో ముగ్గురు నిందితులైన అయినా 1).నాగెళ్ళ సురేష్, 2).ఇలుగు ఏడుకొండలు, 3).దామర రాంబాబు లను ఈరోజు పట్టుబడి చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపించడమైనది. కేసు నమోదైన 24 గంటల లోపల నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించనైనది.నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన S.I రాంబాబు, కృష్ణయ్య లు మరియు కానిస్టేబుల్స్ P.బాలకృష్ణ, K.కళ్యాణ్,M.రామకృష్ణ,SK అక్బర్ లను సి.ఐ నాగార్జున అభినందించినారు.