ప్రజాలహరి హైదరాబాద్ …
ప్రస్తుతఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను రూపొందించాల్సిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చే ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, గనులు శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.