5వ రోజు నేను నా మిర్యాలగూడ,స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులతో కలసి అల్పాహారం చేసిన MLA..
మిర్యాలగూడ ప్రజాలహరి….
మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన పట్టణ పారిశుధ్య స్వచ్ఛంద కార్యక్రమం 5వ రోజు* పట్టణంలోని వినోబా నగర్ *38వ వార్డ్ లో* పాల్గొని పారిశుధ్య కార్మికులతో కలసి అల్పాహారం చేశారు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. కార్మికులతో కలసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతిఒక్క పారిశుధ్య కార్మికుడికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.. మీరు ఇలాగే బాధ్యతగా ప్రజలకోసం, మన పట్టణ పరిశుభ్రత కోసం పనిచేస్తే ప్రజలు మరియు మేము ఎల్లపుడూ మీకు తోడుగా ఉంటామని అన్నారు…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…