Ultimate magazine theme for WordPress.

రైలు నిలుపుదలకు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ని విజ్ఞప్తి చేసిన బంజారా సంఘం నాయకులు విజ్ఞప్తి

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి

నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారికి బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.

హైదరాబాద్ నుండి నల్గొండ జిల్లా నల్గొండ,మిర్యాలగూడ మీదుగా వెళ్తున్న విశాఖ,నారాయణాద్రి,చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లు పై పట్టణాలలో ఈనెల 19 నుండి నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతోప్రజలు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.కరోనా సమయంలోను రైళ్ల నిలిపివేత అమలు చేయగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోని రైల్వే అధికారులపై వత్తిడి తేవడంతో రైళ్ల నిలిపివేత ఒక ఏడాది పాటు కొనసాగింది.మళ్ళీ ఆదాయ మార్గాల పేరుతో గడువు ఏడాది పూర్తి కావడంతో మరో మారు నిలిపివేతను అమలు చేస్తామని రైల్వే అధికారులు నిర్ణయించడంతో మళ్ళీ నల్గొండ,మిర్యాలగూడ ప్రాంత ప్రజలు,ప్రయాణికులలో ఆందోళనలు నెలకొన్నాయి.మిర్యాలగూడ,నల్గొండ ప్రాంతాల నుండి ప్రతిరోజూ వేల సంఖ్యలో విద్యార్థులు,వ్యాపారవేత్తలు,ఉద్యోగులు,సామాన్య ప్రజలు హైదరబాద్,చెన్నై,తిరుపతి వెళుతుంటారు.స్టేషన్లలో రైళ్ల నిలిపివేత లేదనే నిర్ణయంతో పాటు టికెట్ల రిజర్వేషన్ ఆగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రజల,ప్రయాణికుల సంక్షేమం దృష్ట్య గౌరవ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం,రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే రైళ్ల నిలిపివేత అమలు ఉపసంహరించుకునేలా కృషి చేయాలని బంజారా ఉద్యోగుల సంఘం కోరుకుంటున్నట్లు సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ తెలిపారు.

 

post bottom

Leave A Reply

Your email address will not be published.