ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ….ఈరోజు అనగా 17.07.2024 రోజు ఉదయం 5 గంటల సమయంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడెం గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మిర్యాలగూడెం వైపు నుండి ఆంధ్ర వైపుకు వెళుతున్న ఒక Ashok layland గూడ్స్ వాహనం నెం TS08 DP TR 5888 దాని నిండా తెల్ల బస్తాలు కలిగి ఉండి దానిపైన టార్పాలిన్ కప్పబడి ఉన్నందున అనుమానంతో అట్టి వాహనాన్ని ఆపుటకు ప్రయత్నించగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులను చూసి ఆపకుండా పారిపోతుండగా వెంబడించి కొద్ది దూరంలో పట్టుకొని చూడగా అందులో 60 తెల్ల బస్తాలలో సుమారు 30 క్వింటాల వరకు PDS బియ్యం కలిగి ఉన్నాయి వాహనం డ్రైవర్ను అందులో గల మరో వ్యక్తిని విచారించగా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారంకు చెందిన పిండి పూలు పర్వతాలు అను యజమాని PDS బియ్యం లోడ్ చేసి పంపిస్తూ ఆంధ్రాలో నరసింహారావు అను వ్యాపారి వద్ద అన్లోడ్ చేయుటకు పంపిస్తే వెళుతున్నామని తెలిపినారు ఇట్టి అక్రమ PDS బియ్యం లోడును వాహన డ్రైవర్ కార్తీక్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి గోపి, వాహన యజమాని పర్వతాలు, బియ్యం కొనుగోలు చేయు నరసింహారావు అను నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు
*ఎవరైనా గాని ప్రభుత్వo రేషన్ షాపులకు సరఫరా చేసే PDS బియ్యంను అక్రమంగా కలిగి ఉన్న, వ్యాపారం చేసిన అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొబడునుఅని
*గత మూడు నెలల కాలంలో 11 కేసులు నమోదు చేసి 330 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీన పరుచుకోవడం జరిగిందని రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు