Ultimate magazine theme for WordPress.

రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..

(ప్రజాలహరి మిర్యాలగూడ) రైతు రుణమాఫీ సంబరాల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గురువారం చాలా ఉత్సాహంగా ఆనంద ఉత్సవాలతో పాల్గొన్నారు. ఆయన రైతు రుణమాఫీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని విజయోత్సవ ఆనందంతో ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని వివరించారు. యువకుడు, సాహవంతుడు నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్తున్న దని చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచితపస్సు దిగ్విజయంగా నడుస్తుందని ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగుతుందని చెప్పారు. విషయంలో ప్రతిపక్షాలు మేధావులు ఎన్ని విమర్శలు చేసిన వాటిని లెక్క చేయకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీరుడుగా నిలబడి నెల రోజులు ముందే ప్రకటించి చరిత్ర సృష్టించారు. ఒకేసారి రుణమాఫీ ప్రకటిస్తే రైతులలో గందరగోళం ఉంటుందని విడతల వారికి ముందు లక్ష రూపాయలు రుణమాఫీని రైతులకు వర్తింపచేసి మరుసటి రెండో దఫాలోలక్ష నుంచి 1,50,000 లోపు ఉన్న రుణమాఫీ చేసి గ్రామాల్లో రైతుల్లో ఆందోళన కరమైన పరిస్థితి లేకుండా చేయడమే తమ పార్టీ యొక్క లక్ష్యమని చెప్పారు ఇందులో ఎటువంటి అపోహాలకు తావు లేదని పేర్కొన్నారు. మూడో దఫా 1,50 నుంచి 2 లక్షల రుణమాఫీ చేసి పంద్రాగస్టు నాడు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం సభాముఖంగా ప్రకటిస్తారని చెప్పారు .ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకున్నారని ఈరోజు రైతు రుణమాఫీకి గ్రామాల్లో మండలాల్లో తాలుకాల్లో విశేషమైన స్పందన వచ్చిందని ఒక పక్క కరువు తో రైతు బాధపడుతున్న సందర్భంగా రుణమాఫీ రైతు పండగ అండగా ఉంటుందని వివరించారు. రైతు ఏమాత్రం ఆందోళన చెందవద్దని 15 రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీళ్లు వస్తాయని మళ్లీ పంటలు సమృద్ధిగా పండుతాయి ప్రజలకు ఆయన భరోసా ఇచ్చాడు. అడవిదేవలపల్లి మండలం1118, మిర్యాలగూడ మండలంలో 4413, మాడుగులపల్లి మండలాల్లో2702, దామరచర్ల మండలంలో 19 76 , వేములపల్లి మండలంలో 23 66, మొత్తం 12975మంది రైతులకు రుణమాఫీ జరిగినట్లు వివరించారు.రైతుకు ఏ సమస్య వచ్చినా తాను వెన్నంటి ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు . ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ట్రాక్టర్లు , రైతులతో ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ రైతులతో కలిసి ముఖ్యమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అనంతరం రైతు రుణమాఫీ వివరాలను ప్రకటించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.