మా హాస్టల్ మాకే కావాలి
ఈ బాధలు మేం పడలేము
చదువు అయిన మానుకుంటాం
వేములపల్లి( ప్రజాలహరి) కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మోడల్ స్కూల్లో చదువులు కొనసాగించాలని కొండంత ఆశతో వచ్చినటువంటి విద్యార్థినిలకు, అధికారుల నిర్లక్ష్యం వల్ల చదువుకోలేక చదువు మానేసుకుంటే బాగుంటుంది అనే దృక్పథంలో విద్యార్థినిలు ఉన్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి టిఎస్ మోడల్ స్కూల్ విద్యార్థినిలు హాస్టల్లో, మాడుగుల పల్లి మండలం లో ఉన్నటువంటి కస్తూరిబాయ్ పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి వేములపల్లి మోడల్ స్కూల్ హాస్టల్ లో వేయడంతో, ఓవైపు తెలుగు మీడియం, మరోవైపు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు చదువులు కొనసాగించాలంటే పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రెండు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినిలకు ఓవైపు బాత్రూం సౌకర్యం లేక, మరోవైపు స్నానాలు చేయలేని పరిస్థితుల్లో వారి పరిస్థితి ఆగమ గోస్యంగా తయారయింది. ఇట్టి విషయంపై విద్యార్థినీలు ఇప్పటికీ సుమారుగా మూడు నుంచి నాలుగు సార్లు ధర్నా నిర్వహించడం జరిగింది. అయినప్పటికిని సంబంధిత మండల విద్యాధికారి వారి గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో దిక్కు తోసని పరిస్థితులు విద్యార్థులు మంగళవారం ఉదయం పూర్తిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండుటెండలను సైతం లెక్కచేయకుండా ధర్నా చేసినప్పటికిని వారి గోస ఎవరికీ పట్టలేదు దీంతో విద్యార్థులు మేము చదువుకోలేము అని చదువులు మానేసి ఇంటికైనా వెళ్తామని వారు అంటున్నారు. ఎట్టకేలకు ఇట్టి విషయంపై స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని రానున్న వినాయక చవితి అయిపోయే వరకు మీకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తానని చెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. ఏది ఏమైనప్పటికిని ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని, మరోవైపు ప్రజా ప్రతినిధులు ఇరువురు సమన్వయంతో పనిచేసే అట్టి విద్యార్థుల గోస పట్టించుకోవాలని విద్యార్థినిలు విలేకరుల ముందు కన్నీరు మున్నీరుగా తలపించారు. దీంతో రానున్న వినాయక చవితి వరకు ఏమి జరగనుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది