మిర్యాలగూడ నియోజకవర్గానికి అండగా ఉంటాo.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ……మిర్యాలగూడ ప్రజాలహరి మిర్యాలగూడ బైపాస్ వెంట నాలుగు ఫ్లైఓవర్లు నిర్మాణాలు ఈరోజు సాయంత్రం నల్గొండ జిల్లా రహదారుల భవనాల శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మిర్యాలగూడకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకుగాను 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు సభ ముఖంగా తెలిపారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేసిన లక్ష్మారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తనమీద కొందరు కావాలని నిందారోపణలు చేశారని వారికి చంప పగిలేలా ఈరోజు 150 కోట్ల నిధులను సాంక్షన్ చేయించి చూపించాలని తెలిపారు నేను ఏది బయటకు చెప్పానని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా వివరించారు శంకుస్థాపన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్ నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జై వీర రెడ్డి, డిసిసి అధ్యక్షుడు శేఖర్ నాయక్, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి,ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.