Ultimate magazine theme for WordPress.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ పనులను పరిశీలించే మంత్రుల బృందం లో పాల్గొన్నబత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

*శ్రీశైలం జలాశయం ఎస్ ఎల్ బి సి టన్నెల్ పనుల పరిశీలన లో పాల్గొన్న బిఎల్ఆర్*
మిర్యాలగూడ , మిర్యాలగూడ ప్రజాలహరి
శ్రీశైలం జలాశయం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల నీటిని అందించేందుకు నిర్మిస్తున్న 40 కిలోమీటర్ల ఎస్ ఎల్ బి సి టన్నెల్ పనులను ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మిస్తున్న ఈ టన్నెల్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

రూ.4600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును సెప్టెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడువును నిర్దేశించి, పనులు వేగంగా పూర్తిచేయాలని నీటిపారుదల సి ఈ మరియు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ జె పి అసోసియేట్స్‌ను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వంశీ కృష్ణ తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.