ఈరోజు చేనేత పితామహులు స్వాతంత్ర సమర యోధులు తెలంగాణ తొలి మలి ఉద్యమకారులు మాజీ మంత్రి వర్యులు *స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా..
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి
మరియు డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం లక్ష్మణ్ బాపూజీ తన జీవితం అంకితం చేశారని, పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా అనుక్షనం ప్రజా సంక్షేమం కోసం పరితపించిన మహానేత అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
పేద ప్రజలకు అనేక సేవలందించి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ జీవితాశయాన్ని ప్రతిఒక్కరం ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..