రాష్ట్రంలోని ఆదర్శంతమైన మున్సిపాలిటిగా తీర్చిదిద్దుతా .మిర్యాలగూడ ఎమ్మెల్యే. బత్తుల లక్ష్మారెడ్డి..
*మిర్యాలగూడ ప్రజాలహరి..
ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మిర్యాలగూడ పురపాలక సంఘం ను తీర్చిదిద్దుతానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు
మంగళవారం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న
మిర్యాలగూడ సబ్ కలెక్టరనారాయణ అమిత్ మరియు
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , మున్సిపల్ కమిషనర్ మహ్మద్ యూసఫ్
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మిర్యాలగూడ మున్సిపాలిటీనీ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుదాం* దానికి మీ అందరి సహకారం చాలా అవసరం కావున మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతీ సిబ్బంది విభాగాల వారీగా తమ సమస్యలను తెలియజేయండి మీ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఈరోజు సబ్ కలెక్టర్ విచ్చేసారు అని అన్నారు…
అలాగే మున్సిపాలిటీలో గతంలో జరిగిన తప్పిదాలను మరల పునరావృతం కాకుండా చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం..
మున్సిపల్ సిబ్బంది అందరూ నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయండి..* మున్సిపల్ ఉద్యోగ్యం అనేది ఒక గొప్ప సామాజిక బాధ్యత కావున అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ..*మీ సమస్యలు మేము సహకరిస్తాము ప్రజలకు మీరు సహకరించండి అని అన్నారు..* అలాగే అక్టోబర్ 02 న *గాంధీ జయంతి* సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో *స్వచ్చ భారత్* కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది..ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం అందించాలని అలాగే రానున్న తెలంగాణ సంప్రదాయ పండుగ *బతుకమ్మ ఉత్సవాలలో* కూడా ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బంది పనిచేయాలని అన్నారు..
అనంతరం మున్సిపల్ సిబ్బంది విభాగాల వారీగా తమ సమస్యలను తెలియజేయండి జరిగింది..
అనంతరం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు మున్సిపల్ సిబ్బంది తెలియజేసిన ప్రతిఒక్క సమస్యను మేము పరిగణనలోకి తీసుకున్నాము .. అతి త్వరలోనే మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించి మీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.. అలాగే మనం అందరం కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీనీ స్వచ్చ పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.