శెట్టిపాలెం గ్రామానికి కీడు వచ్చిందంటూ.తరలిన గ్రామ ప్రజలు మొత్తం
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో గత కొన్ని రోజుల నుండి గ్రామంలోని ప్రజలు కొంతమంది అనారోగ్యానం చేత, మరి కొంతమంది రోడ్డు ప్రమాదంలో, ఇంకొకరు వయసు అయిపోవడంతో ఇలా ఏదో ఒక రూపంలో గ్రామంలోని ప్రజలు చనిపోతూ ఉండడంతో భయాందోళనకు గురవుతున్న గ్రామంలోని ప్రజలు పలుమార్లు ఊరి పెద్ద మనుషుల దృష్టికి తీసుకు వెళ్లడంతో దీనిపై ఆలోచించిన ఊరి పెద్దలు గత ఐదు రోజుల క్రితం ఊరికి కీడు దాపరించడంతో ఇలా గ్రామంలోని ప్రజలు ఒక్కొక్కరు చనిపోతున్నారని గ్రామంలోని ప్రజలు గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే పొద్దుపొడవకముందే నిద్రలేచినదే తడువు ఆరుబయట కలాపి చల్లకుండా,పొయ్యి ముట్టించకుండా అందరు కూడా తన పంట పొలాల దగ్గరికి కానీ మరియు ఊరి పొలిమేర అవతల కానీ తరలివెళ్లి అక్కడే వంట వార్పు చేసుకొని తిని రావాలని పెద్ద మనుషులు నిర్ణయించి గ్రామంలో టంక వేయించడంతో గురువారం ఉదయాన్నే ప్రజలు మొత్తం ఊరి అవతలికి తరలి వెళ్లారు. కొంతమంది గ్రామ ప్రజలు కీడు లేదు ఏమి లేదని కొట్టిపారేస్తుండడం గమనార్హం