Ultimate magazine theme for WordPress.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటర్ పై లైన్ల పై ప్రత్యేక దృష్టి సారించాలి

Post top

స్వచ్ఛమైన నీటిని అందించాలని మల్టీపర్పస్ వర్కర్లకు సమావేశం
వేములపల్లి) ప్రజాలహరి) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేములపల్లి ప్రజాలహరి…ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఉద్దేశంతో బుధవారం వేములపల్లి, మాడుగుల పల్లి మల్టీ పర్పస్ వర్కర్లకు రైతు వేదిక భవనములు ఆర్డబ్ల్యూఎస్ డి వెంకట్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నప్పుడు వర్కర్లు పైపులు సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా అని చూసుకోవలసిన బాధ్యత మీపై ఉందని ఆయన వారికి సూచించారు. అంతేకాకుండా ఎక్కడైనా పైప్ లైన్లు లీకేజీ ఉన్నట్లయితే ఆ ఏరియాకు నీటి సరఫరాను నిలిపివేసి లీకేజ్ అయినటువంటి పైపులను మరమత్ చేసి తధానంతరం నీటిని విడుదల చేసినట్లయితే ఒకవైపు నీరు వృధా కాకుండా ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎంపీడీవో శారదా దేవి, మండలపల్లి ఎంపీడీవో సంగీత, ఆర్డబ్ల్యూఎస్ సి గంగాభవాని, క్రాంతి కుమార్, వీరాచారి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.