రైతు భరోసా మరో సీజన్ వరకు లేకపోవడంపై భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి…. వచ్చే ఖరీఫ్ సీజర్ నుంచి మాత్రమే రైతు భరోసా అని మంత్రి తుమ్మల నాగేశ్వర ప్రకటించడంపై భారత రాష్ట్ర సమితి మిర్యాలగూడbమాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి గంప గుర్తుగా ఓట్లు వేసినందుకు కాలయాపనలు సీజన్లో సీజన్లో దాటేస్తున్నారని భాస్కరరావు పేర్కొన్నారు రుణమాఫీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని నల్గొండ జిల్లా మంత్రులకు ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఓపెన్ గా చాలెంజిస్తున్నానని వారు కోరుకున్న గ్రామంలో ఎక్కడైనా 100కు 100% రుణమాఫీ అయినట్టు నీరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని భాస్కరరావు పేర్కొన్నారు రైతు రుణమాఫీకి 18000 కోట్లు మాత్రమే ఇచ్చి అంత రుణమాఫీ అయిపోయిందని మంత్రులు ముఖ్యమంత్రులు ప్రగల్బాలు ప్రకటనలు చేస్తూ కాలం వెళ్ళదిస్తున్నారని విమర్శించారు తెలంగాణలో ప్రతి పంటకు పండిన ప్రతి ధాన్యం గింజలు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే సింహారెడ్డి తిప్పన్న విజయసింహారెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర మంత్రులు ప్రజలను రైతులను పక్కదో పుట్టించే మాటలు చేస్తున్నారు తప్ప ప్రజల ఉపయోగపడే ఒక్క పని చేయట్లేదని విమర్శించారు రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ రైతుబంధును క్రమం తప్పకుండా అందించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా మీదుగా స్థానిక సబ్ కలెక్టర కార్యాలయం వరకు ర్యాల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నాగార్జునచారి చిర్ర మల్లయ్య మోసినలి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు