Ultimate magazine theme for WordPress.

నవంబర్ మూడో తేదీన మిర్యాలగూడలో జరిగే బీసీ సదస్సును విజయవంతం చేయాలి

Post top
home side top

ప్ నవంబర్ 3 న బీసీ చైతన్య సదస్సును విజయవంతం చేయాలి* బీసీ జేఏసీ:….
మిర్యాలగూడ ప్రజాలహరి…. నవంబర్ 3న మిర్యాలగూడ లో జరుగనున్న బీసీ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని బీసీ జెఏసి కోరింది.ఆదివారం మిర్యాలగూడ బీసీ భవన్ లో జెఏసి నాయకులు కోల సైదులు ముదిరాజ్ అధ్యక్షతన బీసీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జెఏసి నాయకులు మాట్లాడుతూ కోల సైదులు, మారం శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, రాపోలు పరమేశ్, చిలుమరి కృష్ణయ్య, నాగార్జున చారి, బంటు సైదులు, పొదిల శ్రీనివాస్, తిరుమలగిరి అశోక్, లు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీ వాటా బీసీ లకు దక్కాలని,బీసీ లకు రాజ్యాధికారం దక్కాలని,చట్ట సభల్లో బీసీ లకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ లతో బీసీ మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ సమావేశానికి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, ఆర్.కృష్ణయ్య, నేతి విద్యాసాగర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐ ఏ ఎస్ చిరంజీవులు మేకపోతుల నరేందర్ గౌడ్, తదితరులు హాజరు కానున్నారని తెలిపారు ఈ కార్యక్రమం తో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన బీసీ సరైన న్యాయం జరుగట్లేదని అన్నారు. బీసీ లను అన్ని పార్టీలు ఓట్లేసే వారిగానే చూస్తున్నాయని అన్నారు బీసీ లకు రాజ్యాధికారం బీసీలంత ఏకమై పోరాటం కొనసాగిస్తామని అన్నారు.. వచ్చే నెల మూడవ తారీకు జరిగే సమావేశానికి మిర్యాలగూడ నియోజకవర్గం నుండి
అన్ని బీసీ సంఘాలు,అన్ని కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో పుప్పాల సత్యం సార్, దాసరాజు జయరాజు, బంటు కవిత, సత్యనారాయణ, నల్లగంతులు నాగభూషణం, పొదిల సైదులు, మహేష్ గౌడ్, చేగొండి మురళి యాదవ్, జూలకంటి సత్యం, నేతి సత్యనారాయణ, పున్న రాములు, ఈశ్వర చారి, చిలకల మురళి, చల్ల సోమలింగం, సైదులు, రాములు, సరిత, సైదమ్మ, దుర్గమ్మ, చిమట ఎర్రయ్య,రజక వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.