*ఇందిరమ్మ రాజ్యం నిర్మాణం జరగాలి అంటే అందరి సహకారం ఉండాలి…MLA -BLR*
వేములపల్లి ప్రజాలహరి…… వేములపల్లి మండలం ప్రజా సమస్యలపై ప్రజా పాలనలో పాల్గొన్న
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .
వేములపల్లి మండల కార్యాలయం నందు అధికారులతో కలసి ఇప్పటివరకు ప్రజా పాలనలో సేకరించిన దరఖాస్తుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు…
*అన్ని విభాగాల అధికారులకు వచ్చిన ఫిర్యాదులు ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు..*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
*గ్రామాలు అభివృద్ది చెందితేనే నియోజకవర్గం , రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని అన్నారు… గ్రామాలు అభివృద్ది చెందాలంటే గ్రామ పంచాయితీ కార్యదర్శి ల పాత్ర చాలా కీలకం అని అన్నారు.*.
*వేములపల్లి మండలంలో ధాన్యం పండించే రైతులు అధికం కావున ధాన్యం కొనుగోలు విషయంలో , రైస్ మిల్లర్లకు తరలించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అందరూ గ్రామాల్లో రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలి అని అన్నారు*
*రైతులకు రవాణా విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రమాదాలు జరగకుండా రహదారులు అన్ని మరమ్మతు పనులు చేయాలి అని R&B మరియు ఇరిగేషన్ అధికారులకు సూచించారు* …
అనంతరం ప్రజలతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి ఫిర్యాదులు సేకరించారు …
ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ
*ప్రజలు, రైతులు తమ సమస్యలు పరిష్కారం కోసం మిర్యాలగూడ పట్టణం వరకు దూర ప్రయాణాలు చేసి ఇబ్బంది పడుతున్నారు అలా వారికి ఇబ్బంది కలగకుండా అధికారులను వారి దగ్గరకి తీసుకొని రావాలని అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై ప్రజా పాలన కార్యక్రమం*
ఈ కార్యక్రమం ప్రతీ వారం ఆయా మండలాల అధికారుల సమక్షంలో కొనసాగుతుంది అని అన్నారు…
*అధికారులు ఫిర్యాదులు తీసుకోడమే కాదు వాటి పరిష్కారం కూడా వేగంగా జరగాలి అని అన్నారు.*
*ఇందిరమ్మ రాజ్యం నిర్మాణం జరగాలి అంటే ఈ ప్రజా పాలన విజయవంతంగా నిర్వహిస్తూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు..*
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు…