తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు చైర్మన్ భార్గవ్.. మిర్యాలగూడ మిర్యాలహరి.., మిర్యాలగూడ మిర్యాలగూడలో పాత ఆంధ్ర బ్యాంక్ వద్ద స్థలాన్ని నాలుగున్నర కోట్లకు కొనుగోలు చేస్తే 20 కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మన్నేo రంగారెడ్డి, గోవిందరెడ్డి సైదిరెడ్డి, ములగం రమేష్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ స్థలము 1976 నుంచి కన్స్ట్రక్షన్ ఉన్నదని, 2020లో ఈ భూమిని తన మిత్రులైన వారు కొనుగోలు చేశారని చైర్మన్ పేర్కొన్నారు ఇది ప్రభుత్వ స్థలమని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారని ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్లు 991, 992, 993 994లో సుమారు 14 ఎకరాలు పైన భూమి ఆవాదిగా రికార్డులో ఉన్నదని ఆ భూములలో ఉన్న ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కావాలని దురుద్దేశంతో తమ అనుచరులకు నోటీసులు ఇచ్చారని ఆయన చెప్పారు. వాస్తవానికి తనకు సంబంధం లేని విషయమై కానీ తమ మిత్రులు అయిన వారిని అధికారులు తప్పు పట్టించే ధోరణిలో నోటీసు ఇవ్వడం వలన ఈ విధంగా స్పందించాల్సి వచ్చిదనీ పేర్కొన్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులకు భూమికి సంబంధించిన సెల్ఫీ డాక్యుమెంట్లు ఇవ్వటం జరిగిందని చెప్పారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.