ప్రజాలహరి, హైదరాబాద్… స్వర్గీయ కోదాటి లక్ష్మీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈనెల 22, 23 తేదీల్లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలంగాణ నాటకాల సమైక్య మరియు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోదాటి లక్ష్మీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి . నాటక రంగానికి కేఎల్ఎన్ఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా సభలో వక్తలు సేవలను కీర్తించారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్సీ సురబి. వాణిదేవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు భాషలు, కళారూపాలను నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. సాహిత్యం, కవులు ,రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా తాలూకా స్థాయిలలో సాహిత్యం మీద కవిత వచనాల మీద కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నాటకాల సమాజాల సమైక్య అధ్యక్షుడు టి .రామచంద్రరావు, సాహితీ అకాడమీ పూర్వ అధ్యక్షుడు గౌరీ శంకర్, సాహితీ అకాడమీ అధ్యక్షుడు శివకుమార్, దర్శకులు గుమ్మడి గోపాలకృష్ణ, మేక రామకృష్ణ, మరియు స్వర్గీయకోదాటి లక్ష్మీ నరసింహారావు కుమార్తె శ్రీమతి సుజిత, అల్లుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.